Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
హైదరాబాద్ నగరాన్ని పూర్తి వ్యాక్సినేషన్ సిటీగా మారుస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ చేపట్టిన జీహెచ్ఎంసీ డోర్ టూ డోర్ కోవిడ్ వ్యాక్సిన్ వేసే ముందు కోవిడ్-19 క్లినికల్ ట్రయల్స్ బయటపెట్టాలని అవేకెన్ ఇండియా మూవ్మెంట్ ప్రతినిధులు సుహాసిని, డాక్టర్ ప్రవీణ్ సక్సెనా, డాక్టర్ సురేంద్రరాజు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో టీకా పేరుతో మారణహోమం జరుగుతుందని, బలవంతంగా వ్యాక్సిన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది మానవహక్కులను ఉల్లంఘించడమేనన్నారు. టీకాలో ఆవు, పంది రక్తం, జన్యు మార్పిడి చేసిన పదార్థాలు, అల్యూమినియం తదితర ప్రమాదకర విష పదార్థాలు ఉన్నట్లు పరిశోధనల్లో బయట పడినట్లు చెప్పారు. కోవిడ్ వల్ల ఎవరూ చనిపోలేదని, దాని చికిత్స వల్లనే ఎక్కువ మంది మరణించారన్నారు. ప్రయివేట్ కోవిడ్ హాస్పిటల్స్లో ప్రమాదకరమైన స్టెరాయిడ్ చికిత్స వల్ల బ్లాక్ ఫంగస్ తదితర దీర్ఘకాలిక సమస్యలు తలెత్తాయన్నారు. పౌష్టికాహారం, వ్యాయామంతో సహజంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోవచ్చునన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కొంత మందికి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దీని ప్రభావం రెండేండ్ల నుంచి ఐదేండ్ల వరకూ ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.