Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్ 2021 ప్రవేశపరీక్షలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 9 జిల్లాలోని 49 సెంటర్స్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 42,399 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో 34,185 మంది (80.6%) పరీక్షలకు హాజరయ్యారని కన్వీనర్ రామకృష్ణ, కో కన్వీనర్ ప్రొ.శంకర్ పేర్కొన్నారు. ప్రిలిమినరీ కీని ఈనెల 29న విడుదల చేయనున్నట్లు చెప్పారు. అంతకుముందు ఓయూ వీసీ ప్రొ.రవీందర్ మౌలాలిలో, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొ.సీత రామారావు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేపట్టారు. కార్యక్రమంలో డీన్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్ కె మూర్తి పాల్గొన్నారు