Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని డాక్టర్ ఏఎస్రావు నగర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆమె నివాసానికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వే జీహెచ్ఎంసీ సిబ్బంది పకడ్బందీగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీఎస్ఎఫ్ఏ కిషోర్, శంకర్, వినోద్, దేవిక, మణిపాల్రెడ్డి, విశ్వకర్మ ట్రస్ట్ కాప్రా సభ్యులు ఆందోజు రామాచారి, కలకొండ భిక్షపతిచారి, మారోజు నరసింహాచారి, మహంకాళి నరసింహాచారి పాల్గొన్నారు.