Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
'టు-లెట్' బోర్డుల ఏర్పాటుపై విధించిన జరిమానా విషయంలో ఎన్ఫోర్స్మెంట్, విజిలె న్స్, డిజాస్టర్మేనేజ్మెంట్ (ఈవీడీఎం) నిర్ణయం వివాదంగా మారింది. కూకట్పల్లి జోన్లోని అల్లాపూర్లో ఓ ఇంటి యజమాని తన ఇంటి వద్ద పెట్టుకున్న 'టు-లెట్' బోర్డుకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిమానా విధించారు. జీహెచ్ఎంసీ నిర్ణ యంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేయ డంతో జీహెచ్ఎంసీ అధికారులు యూ టర్న్ తీసుకున్నారు. 'టు-లెట్' బోర్డుల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు బుధవారం జీహెచ్ ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) అధికారికంగా ప్రక టన విడుదల చేసింది. అయితే అనుమతిలేని హోర్డింగ్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరి మానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. చిరు వ్యాపారులు, చిన్నచిన్న ప్రయివేట్ స్కూళ్లకు సైతం భారీగా జరిమానాలు వేస్తున్నారనే విమ ర్శలూ లేకపోలేదు. ఎన్ఫోర్స్మెంట్ విభాగం తీసుకుంటున్న చర్యలు, వేస్తున్న జరిమానాలపై జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరే టర్లంతా మూకుమ్మడిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిమానాలకు వ్యతిరేకంగా అధికారు లపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.
ఇండ్లకు కాదు..ప్రకటనలకే..
వ్యక్తిగతంగా తమ ఇండ్ల వద్ద ఏర్పాటు చేసుకునే 'టు-లెట్' బోర్డులపై ఎలాంటి జరిమా నాలూ ఉండవని స్పష్టం చేశారు. అయితే అను మతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే అన్ని రకాల పోస్టర్లపై జరిమానాలు విధిస్తా మని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఈవీడీఎం విభాగానికి చెందిన సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాల్లోని అనది óకార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, వాల్రె ౖటింగ్ తదితరాలపై అధికారులు బుధవారం జరి మానా విధించారు. ఈ సందర్భంగా జీహెచ్ ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ మీడియాతో మాట్లాడుతూ సొంత ఇంటికి టులెట్ బోర్డులకు ఎలాంటి జరిమానా విధించలేదన్నారు. వ్యక్తిగ తంగా ఇండ్ల వద్ద ఉన్న టు-లెట్ బోర్డులపై జరిమానా విధిస్తే తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి పోస్టర్లను అంటించరాదని చెప్పారు. నగరంలో అనధికార బ్యానర్లు తది తరాల ఏర్పాటుపై జనిమానా విధించినట్టు వారు వివరించారు.