Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట/మూడుచింతలపల్లి
ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో ఆవు మత్యువాత పడింది. ఈ ఘటన మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత పాడి రైతు చిలకొల నర్సింహ తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులు, గేదెలను మేపుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైరు తగిలి ఆవు చపిపోయిందనీ, ఆవు విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బోరున విలపించారు. ఎలాగైనా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వేడుకున్నారు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ సింగం ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.