Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబరాబాద్ ప్రజలకు సేవచేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి నూతన ఆర్టీసీ ఎండి వీసీ.సజ్జనార్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు, హోం మంత్రి మహమూద్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు తాను అందించిన సేవలు సంతృప్తినిచ్చాయని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి, ప్రజా ప్రతినిధులకు, రంగారెడ్డి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లకు, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా జడ్జీలకు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ అధికారులకు, ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, ఇతర సంస్థలు, సేవలు అందించడంలో వెన్నంటి నడిచిన ప్రతీ ఒక్కరికి, ప్రోత్సహించిన రంగారెడ్డి, మేడ్చల్ ప్రజా సంఘాలకు, ప్రజలకు, మీడియా మిత్రులకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు.