Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కరస్పాండెంట్, టీచర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలనీ కోరుతూ కుత్బుల్లాపూర్ బడ్జెట్ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్, షాపూర్నగర్ సాగర్ హౌటల్ నుంచి గాజుల రామారం చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్ చైర్మెన్ శివయ్య మాట్లాడుతూ... కరోనా లాక్డౌన్ సమయంలో ప్రయివేట్ పాఠశాలల ఉపాధ్యాయుల కరస్పాండెంట్ల బతుకులు అగమ్యగోచరంగా మారాయన్నారు. పాఠశాలలో అద్దెలు కట్టలేక, టీచర్ల జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక, అప్పుల బాధ భరించలేక, కొంతమంది కరస్పాండెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం మానవతా దక్పథంతో ఆదుకోవాలని, చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కరోనా సమయంలో పాఠశాలల నీటి బిల్లులు, కరెంటు బిల్లు, ఆస్తిపన్ను రద్దు చేయాలని కోరారు. బడ్జెట్ పాఠశాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ బడ్జెట్ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వరప్రసాద్, కార్యదర్శి మహేష్, కోశాధికారి దయాకర్. ముఖ్య సలహాదారు మండవ శ్రీనివాస్ గౌడ్, కోల వెంకటేష్, గోవర్ధన్ రెడ్డి, చారి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు