Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
స్థానిక సమస్యలను అధ్యయనం చేసేందుకు గురువారం కంటోన్మెంట్ ప్రాంతానికి 18 మంది ఎంపీలు, ఇతర అధికారులతో కూడిన కమిటీ సభ్యులు వచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు ఏవోసీ అధికారుల కార్యాలయంలో భేటీ అయి సుధీర్ఘంగా చర్చించారు. ఆరు గంటలకు బొల్లారం ఆస్పత్రిని సందర్శించారు అనంతరం కార్ఖానా రిజర్వాయర్ పరిశీలించి నీటి సామర్థ్యం, ఇతర అంశాలను తెలుసుకున్నారు. కాగా పార్లమెంటరీ కమిటీలో ఏ అంశాలపై చర్చించారన్న విషయంపై అధికారులు మీడియాకు వెల్లడించలేదు. అంతేగాక కమిటీ సభ్యుల పర్యటనను కవరేజ్ చేసేందుకు మీడియాను అనుమతించలేదు. ఇదిలా ఉండగా ఏవోసీ మిలటరీ ఆఫీసులో జరిగిన మీటింగ్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్లమెంటరీ కమిటీ చైర్మెన్కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని వివిధ సమస్యలను చైర్మెన్ దష్టికి తీసుకెళ్లినట్టు సాయన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్ల మూసివేత, ఇంకా కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలన్న అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే బోర్డు పరిధిలో సమస్యలపై పార్లమెంటరీ కమిటీకి వినతిపత్రాలు ఇవ్వాలని, ఆయా పార్టీలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు తయారు చేసుకున్న బోర్డు అధికారులు మిలిటరీ అధికారులు ఎవరికీ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజా ప్రతినిధులు నిరుత్సాహానికి లోనయ్యారు కనీసం అధికారులు మీడియాను కూడా అనుమతించకపోవడంతో ఏ అంశాలపై చర్చించారనేది ఎవరికీ తెలియకుండా పోయింది. కాగా కంటోన్మెంట్ను మున్సిపాలిటీలో విలీనం చేయాలని కొందరు వార్డు కమిటీ సభ్యులు వినతి పత్రం ఇవ్వడానికి బొల్లారం ఆస్పత్రి వద్దకు వచ్చినా అధికారులు కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతోవారు నిరసన వ్యక్తం చేశారు.