Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
కరోనా వ్యాక్సిన్పై అపొహలు వీడాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసోద్దిన్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఐస్సాక్ పాఠశాలలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇంటింటి సర్వే పనితీరును ఆమె పర్యావేక్షించారు. రాధాకృష్ణనగర్, రామారావునగర్, గణేష్నగర్, న్యూ రామారావునగర్, హరినగర్లలో ఇంటింటి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పి సురేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కీర్తి, సీఆర్పీ హుస్సేన్బి, మమతా, కళావతి, నాగుల సత్యం, నరేందర్ర, రాంరెడ్డి, ఆవుల సంజీవ, శ్రీధర్, యాదగిరి, యోగిరాజ్ తదితరులు పాల్గొన్నారు.