Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు
నవతెలంగాణ-కూకట్పల్లి
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని రిక్షాపుల్లర్స్ కాలనీ, రామకష్ణానగర్ కాలనీవాసులు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న సందర్భంగా కమిటీ సభ్యులకు ప్రశంసా పత్రాన్ని టీఐఎస్ నరేందర్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ మాధవరం రోజా దేవిరంగారావు అందజేశారు. కార్పొరేటర్ రోజాదేవి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొవిడ్ రూల్స్ పాటించాలని, మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, బిల్ కలెక్టర్ రాజు, కాలనీవాసులు సాలయ్య, కష్ణ, లింగయ్య, విక్రమ్, మధు, కవిత, సాయిబాబా, యూసఫ్, సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు.