Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
మంత్రి చామకూర మల్లారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరస నంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి చౌరస్తాలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందాడి సురేందర్ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి కేసిఆర్, కేటిఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కొండల్రెడ్డి పాల్గ్గొని మంత్రిపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శులు నల్లవెల్లి శేఖర్, కొమ్ముల ప్రశాంత్, కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి, సుర్వి రవీందర్ గౌడ్, బెజ్జంకి హరిప్రసాద్రావు, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అక్రమ్ ఆలీ, దాసరి శంకర్, నాయకులు బద్దం జగన్ మోహన్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, చక్రపాణి, అబ్బవతి నర్సింహ్మ, మోటుపల్లి శ్రీనివాస్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, ఐలయ్య, శ్రీనివాస్, ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.