Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని హస్తినాపురం సెంట్రల్ వద్ద కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దెంది శశిధర్ రెడ్డి అధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రి మల్లారెడ్డి మల్కాజిగిరి ఎంపీి, టీపీసీసీి పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంత్రి మల్లారెడ్డి దిష్టి బొమ్మని దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడి విద్యార్థులని మానసికంగా హింసిస్తూ నిత్యం అధికార పార్టీ అండతో అక్రమ దందాలు చేసుకునే మల్లారెడ్డి కి రేవంత్ రెడ్డిని దూషించే స్థాయి కానీ, అధికారం కానీ లేవని వారు అన్నారు. రేవంత్ రెడ్డి పై దుష్ప్రచారం చేస్తే ఎంతటి వారైనా తగిన మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్, మహేష్, సాయి రాంరెడ్డి, నరసింహ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రం శాం చరణ్ రెడ్డి, శివనాయక్ పాల్గొన్నారు.