Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలుగు భాషాభివద్ధి ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో భాషా పరిరక్షణకు కషి చేసిన దేవులపల్లి రామానుజరావు సంస్మరనీయులని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు నివాళులు అర్పించారు. శ్రీత్యాగరాయ గాన సభలో 'ఎందరో మహానుభావులు' శీర్షికన నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా కళా సుబ్బారావు కళా వేదికపై గురువారం దేవులపల్లి రామానుజరావు జయంతి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిóగా ప్రభాకరరావు మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి సమకాలీకునిగా రామానుజరావు గోల్కొండ పత్రిక నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. బేవరీజిస్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ సారస్వత పరిషత్ హైద్రాబాద్లో నెలకొల్పిన రామానుజరావు భాషా సాంస్కతి పరిరక్షణలో విశేష కషి చేశారని వివరించారు. వేదికపై గెస్న సభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించిన సభలో కళా పోషకుడు వెంకటరెడ్డి, సాహితీ కిరణం పత్రిక సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, ఉష, లతా వర్మ పాల్గొన్నారు.