Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
సెప్టెంబర్ ఫస్టు నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడ ప్రాథమిక ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నాదర్ గుల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. పిల్లలకు అవగాహన కల్పించి భౌతిక దూరం పాటించేలా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, గూడెపు ఇంద్రసేన, ముత్యాల లలిత కృష్ణ, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, నాయకులు జెనిగే అయిలయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.