Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సెప్టెంబర్ ఫస్టు నుంచి స్కూళ్లు ఓపెన్ కానున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని స్కూళ్లల్లో శానిటేషన్ బాధ్యతలను జీహెచ్ఎంసీ పర్యవేక్షి స్తోంది. అందుటో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 690, రంగారెడ్డి జిల్లాలో 167 గవర్నమెంట్ స్కూళ్లను, కాలేజీలను, మేడ్చల్ జిల్లాలో 276 గవర్నమెంట్ స్కూళ్లను మొత్తం 1133 స్కూళ్లలో జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో క్లీనింగ్ పనులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అంబర్పేట గవర్నమెంట్ స్కూల్లో, ముషీరాబాద్ జవహర్నగర్లోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో శానిటేషన్ పనులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం పరిశీలించారు. స్కూల్ పరిసరాలు, లోపల శుభ్రం చేయాలని ఆదేశించారు. పిల్లలు బడికి వెళ్తారు కాబట్టి ఎక్కడా నిర్లక్ష్యం చేయవద్దని, పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్పొరేటర్లు తమ డివిజన్స్లో గవర్నమెంట్ స్కూళ్లను పరిశీలించడంతోపాటు ప్రయివేట్ బడుల్లోనూ స్ప్రేయింగ్ పనులను పర్యవేక్షించాలని మేయర్ కోరారు. ఈనెల 30 లోపు పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూళ్లు, కాలేజీలను శుభ్రం చేస్తామని మేయర్ తెలిపారు. సిటీలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసి దేశంలోనే ఫస్ట్ప్లేస్లో నిలుపుతామన్నారు. బుధవారం నాటికి 945 కాలనీలలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. మరిన్ని కాలనీల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు.
సర్టిఫికెట్లు అందజేత
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో వందశాతం పూర్తయిన కాలనీలకు జీహెచ్ఎంసీ నుంచి సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. అందులో భాగంగానే అంబర్పేట అనంతరాంనగర్ కాలనీ, ఎంసీహెచ్కాలనీల్లో వందశాతం పూర్తయినందుకు కాలనీవాసులకు స్థానిక కార్పొరేటర్ విజరు, డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతితో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సర్టిఫికెట్ అందజేశారు. ముషీరాబాద్లోని కళాధర్నగర్, గాంధీనగర్లోని వివేక్నగర్లో వందశాతం పూర్తయిన కాలనీలకు ఎమ్మెల్యే ముఠాగోపాల్, కార్పొరేటర్ సుప్రియ నవీన్గౌడ్, పావనీ వినరుకుమార్లతో కలిసి మేయర్ సర్టిఫికెట్లను అందజేశారు.