Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్నగర్
కోవిడ్ నియంత్రణకు 18 యేండ్లు నిండినవారు అందరు వాక్సిన్ వేయించుకోవాలి అని ఆర్కెపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్రెడ్డి అన్నారు. గురువారం డివిజన్లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతత్వంలో ప్రజలకు ఉచితంగా అందజేస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం 99 శాతం పూర్తి చేసిన ఈస్ట్ యాదవ్నగర్ కాలనీలో విజయవంతం కావడంతో రాధా ధీరజ్ రెడ్డి, ఏసీపీ సుస్మిత చేతుల మీదుగా కాలనీ సెక్రెటరీ ఉన్న రఘుకి ప్రభుత్వం తరపున సర్టిఫికెట్ అందచేసారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కోవిడ్ అదుపులోకి రావాలి అంటే వాక్సిన్ తప్పనిసరిగా వేయుంచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాములు యాదవ్, జిహెచ్ఎంసి జవాన్ యాదగిరి, ఏరియా నెంబర్ రమేష్ గౌడ్, సతీష్, ఆంజనేయులు, రఘు, కాలనీవాసులు పాల్గొన్నారు.