Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి చామకూర మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు కంటోన్మెంట్ కాంగ్రెస్ కమిటీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ గురువారం నాడు కంటోన్మెంట్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాల ఎదురుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు డి.బి.దేవేందర్, శామ్సన్రాజ్, బద్దం బల్వంత్రెడ్డి, ప్రముఖ న్యాయవాది వినోద్, గజ్వేల్ భారత్, మహ్మద్ జమీల్, మురళీ తదితరులు నిరసన కార్యక్రమాలు చేపట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మంత్రి చామకూర మల్లారెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఈ సందర్భంగా శామ్సన్ రాజు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డిపై విమర్శలు గుప్పించారు. భూములు కనిపిస్తే చాలు ఆకలి వేసే నీకు భూకబ్జా కోరుగా ఆరువందల ఎకరాలు సంపాదించి మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పీసీసీగా నియమించింది, వందకోట్లు గుమ్మరించి నీ అల్లుడిని గెలుపించలేకపోయావని ఈ సందర్భంగా శాంసన్ రాజు అన్నారు. అంతకు ముందు డి.బి.దేవేందర్, గజ్వేల్ భారత్, జమీల్ మాట్లాడుతూ మల్లారెడ్డిపై విమర్శలు చేశారు. మంత్రిగా మల్లారెడ్డి కంటోన్మెంట్ పరిధిలో ఎలా తిరుగుతావో చూస్తామని, నిన్ను తిరుగనీయకుండా చేస్తామని కూడా కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. తదనంతరం కాంగ్రెస్ నాయకులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో మంత్రి చామకూర మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు.