Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ-అంబర్పేట
రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, సమస్యల సత్వర పరిష్కారానికి విద్యార్థి జన సమితి పోరాటం చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యార్థి జన సమితి అధ్యక్షుడు నిజ్జన రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు 20% నిధులు కేటాయించాలన్నారు. యూనివర్శిటీలలో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్ల మూసివేతను వెంటనే ఆపాలన్నారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీలలో రాజకీయ జ్యోక్యం తగ్గించాలన్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్నందున పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్ధి జన సమితి ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, ప్రవీణ్ ఆర్య, వినోద్ కుమార్, బాబు మహజన్, అరుణ్ కుమార్, ప్రశాంత్, నరేందర్, వీరనాయక్, రాజేష్ నాయక్, శ్రీను, జీవన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.