Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
'స్వాతంత్య్ర అమత మహోత్సవం' పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఎంజీబీఎస్లో 'ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల' పై ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈకార్యక్రమానికి జాయింట్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మన వారసత్వంలో భాగమని, వీటిని తరువాతి తరానికి అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలు మనలో దేశభక్తి, జాతీయ భావం పెంపొందేలా సహాయపడతాయన్నారు. యువత స్వాతంత్య్ర సమరయోధుల సందేశాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయాలని రమేష్ రెడ్డి కోరారు. తెలుగు స్వాతంత్య్ర సమరయోధులపై ఆర్ఓబీ తయారు చేసిన పలు అంశాలను హైదరాబాద్ పోలీస్ శాఖ సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తామన్నారు. ఆర్ఓబీ పీఐబీ డైరెక్టర్ శతి పాటిల్ మాట్లాడుతూ 'ఐకానిక్ వీక్'హొ పురస్కరించుకొని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా ప్రాంతీయ స్వాతంత్య్ర సమరయోధుల ప్రాముఖ్యతను తెలియచేయడానికి ఈ చిత్ర ప్రదర్శనను ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా కేంద్ర సమాచార శాఖకు చెందిన హైదరాబాద్ పబ్లికేషన్ డివిజన్, పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ (డాక్టర్) మానస్ కష్ణకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్లు హరిబాబు, భారత లక్ష్మి, వందన,హొ ఎన్.వై.కె కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.