Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలకే వెళ్లి కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధి మామిడి పల్లి 11వ డివిజన్, బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భారత గ్రామ నవనిర్మాణ మారి స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని యువ నాయకులు కౌశిక్ రెడ్డి, మహేశ్వరం నియోజక వర్గం బీసీ సెల్ అద్యక్షులు నిమ్మల నరేందర్తో కలిసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చుక్క శివ కుమార్, సూర్ణగంటి అర్జున్, మారి స్వచ్ఛంద సేవ సంస్థ కోఆర్డినేటర్ మాసాన్ని వెంకన్న, సాంబశివ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు