Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయశ్ రంజన్
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయశ్ రంజన్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర నీటి నిల్వల చైర్మెన్ వి ప్రకాష్, డైరెక్ట్ సెల్లింగ్ అధ్యక్షుడు భరత్ రాజ్, వివిధ కంపెనీల సభ్యులతో కలిసి నూతన కార్యవర్గ పరిశ్రమల పత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం జయేష్ రంజన్ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 15 వేల కోట్ల పెట్టుబడులు సమీకరించాలని దాదాపు ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. వి,ప్రకాష్ మాట్లాడుతూ రాబోయే మూడేండ్లలో తెలంగాణ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటుందన్నారు. దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అత్యంత అద్భుతంగా కొనసాగుతుందని తెలియజేస్తూ వినియోగదారుడికి ఉత్పత్తిదారుడుకి ఎంతో సులభమని సూచించారు. అధ్యక్షుడు భరత్ రాజ్ మాట్లాడుతూ. ప్రతి పౌరుడు నాసిరకం ఉత్పత్తులను వినియోగించడానికి ఇష్టపడడం లేదన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో నాసిరకం ఉత్పత్తిదారులకు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.