Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట/మూడుచింతలపల్లి
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి మల్ల రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్లగౌని చిత్తయ్యగౌడ్, వనందాస్ మురళీ గౌడ్, మధుకర్ రెడ్డి, సర్పంచులు జాము రవి, కపాకర్రెడ్డి, రమేష్, శివ,యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.