Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలోనే అతిపెద్ద డయాగస్టిక్ లాబొరేటరీ చైన్లలో ఒకటైన అపోలో డయాగస్టిక్స్ హైదరాబాద్లో అత్యాధునిక గ్లోబల్ రిఫరెన్స్ ల్యాబ్ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈల్యాబ్ మూడువేలకంటే ఎక్కువ పరీక్షల మెనూని అందిస్తున్నది. భారతదేశం, ఆగేయాసియా వ్యాప్తంగా తన సేవలను అందిస్తోంది. 30,000 చదరపు అడుగుల సువిశాలమైన విస్తీర్ణంలో హైదరాబాద్ శివారులోని బాలానగర్ వద్ద ఈ డయాగస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
అపోలో డయాగస్టిక్స్ గ్లోబల్ రిఫరెన్స్ ల్యాబ్ ఆర్టీపీసీఆర్లు, సీబీఎన్ఎఎటి, జెన్ఎక్స్పర్ట్ టెస్టింగ్లతో అత్యాధునిక మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్ను కలిగి ఉంది. బయోకెమిస్ట్రీకి చెందిన అన్ని సేవలను, ఇమ్యునోలజీ, ఫ్లో సైటోమెట్రీతో హెమటాలజీ సేవలను అదే అంతస్తులో ఇమ్యునోఫ్లోరోమెట్రీతో సాధారణ పరీక్షలను అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా అందిస్తున్నది. అపోలో గ్లోబల్ రిఫరెన్స్ ల్యాబ్ దేశంలోనే మాతత్వ, నవజాత శిశువుల పరీక్షలు చేస్తున్న ఏకైక ల్యాబ్. జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్స్ 33వ వార్షికోత్సవం అయినందున ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డ్కెరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి అన్నారు. అత్యాధునికమైన ఈ మాలిక్యులర్ ల్యాబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్లతో సరిసమానంగా ఉన్నదని, మానవ జోక్యం లేకుండా రోజుకు 50వేలకుపైగా నమూనాలను ప్రాసెస్ చేయగల సామర్థ్యం కలిగివుందన్నారు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో ఒక గేమ్ ఛేంజర్గా ఉండనుందని అన్నారు. ఈ కేంద్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపులు రానున్నాయని, అపోలో డయాగ్నోస్టిక్స్ అనేది అపోలో హెల్త్, లైఫ్స్టయిల్ ఒక విభాగం, ఇది ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, లక్నో ఏడు ప్రధానమైన హబ్లతో డయాగస్టిక్స్లో ప్రత్యేకతను కలిగి ఉన్నదన్నారు.