Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
తమ పార్టీ ఎమ్మెల్యే, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డిపై, స్థానిక నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, పోగుల నరసింహరెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిల ఆధ్వర్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. డీఐ మఖ్బూల్ జానికి ఫిర్యాదు పత్రం అందచేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుటం, దూషించడం సరైంది కాదన్నారు. రెండు రోజులుగా జరిగిన పరిణామాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో కార్పోరేటర్లు బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్గౌడ్, జడిగే మహేందర్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు అడ్వార్డ్ జ్ఞాన దేవ్ ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు జె.రాములు, కాటపల్లి రాంచంద్రారెడ్డి, కప సాగర్, చక్రపాణి గౌడ్, మోదుగు శేఖర్ రెడ్డి,అలీం తదితరులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ మేయర్ అధ్వర్యంలో మరో ఫిర్యాదు
మంత్రి మల్లారెడ్డిపై రేవంత్రెడ్డి అనుచి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి నేతత్వంలో మేడిపల్లి పీఎస్లో టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, బచ్చరాజు, మద్ది యుగంధర్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు జగదీష్ రెడ్డి, పాషా, టీఆర్ఎస్ నేతలు ఈశ్వర్ రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్గౌడ్, పాశం బుచ్చి యాదవ్లు పాల్గొన్నారు.