Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
వినాయక్నగర్ డివిజన్లో వందశాతం వ్యాక్సినేషన్ కోసం కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి తెలిపారు. వినాయక్నగర్ డివిజన్ జై కాలనీలోని సీడ్ స్కూల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, వందశాతం వ్యాక్సినేషన్ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్లో స్వచ్ఛందంగా సేవ చేస్తున్న బీజేపీ కార్యకర్తల సేవలను ఆమె అభినందించారు. ఈ స్కూల్ కరస్పాండెంట్ ఆశిష్కౌశల్, డాక్టర్ అమరావతి, ఓజాయీర్, వైద్య సిబ్బందికి, కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సర్వేశ్, సాయిసురేష్, భార్గవగౌడ్, శివ, మల్లేష్, కృష్ణ, శ్రీకాంత్యాదవ్, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.