Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నిజాం, యూనివర్సిటీ మహిళా కళాశాల, సైఫాబాద్ సైన్స్ కళాశాలల డిగ్రీ హాస్టళ్ల మూసివేత విరమించుకోవాలని పీడీఎస్యూ (విజంభణ) ఆద్వర్యంలో శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వినతి పత్రము అందజేశారు. వసతిగహంలో సౌకర్యం లేనియెడల గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం హాస్టళ్ల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లూరి విజరు, ఉస్మానియా యూనివర్సిటీ కోకన్వీనర్లు దుర్గం దిలీప్, బి.అఖిల్ పాల్గొన్నారు. నిజాం, కోటి ఉమెన్స్, సైబరాబాద్ డిగ్రీ విద్యార్థుల హాస్టల్ వసతి కొనసాగించాలని టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాదిగ అన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన యూనివర్సిటీ పాలకమండలి విద్యార్థి వ్యతిరేక విధానాలకు శ్రీకారం చుట్టడం అప్రజాస్వామికం అన్నారు. ఓయూ అధికారులు తమ నిర్ణయాన్ని సమీక్షించి, నిర్ణయాన్ని రద్దు చేయాలని టీఎస్యూ డిమాండ్ చేస్తుందన్నారు.