Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీ నగర్ డివిజన్ త్వరలో వంద శాతం వాక్సిన్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. శుక్రవారం అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవరణలో జరిగిన మొబైల్ వ్యాక్సిన్ డ్రైవ్ ను సందర్శించి మాట్లాడారు. వ్యాక్సిన్ వేయించుకొని, కోవిడ్ నిబంధలతో రోజువారీ కార్యక్రమాలు చేసుకోవాలని స్టానికుల్ని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నగర సీనియర్ నాయకులు ఎ. వినరు కుమార్, అశోక్ నగర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు రాం మూర్తి, సెక్రటరీ సూర్య నారాయణ, వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ రావు, ట్రెజరర్ రమేష్, సభ్యులు రామ్ గోపాల్, నాగలక్ష్మి, జయసూర్య, డాక్టరు కలింది దేవి, తది తరులు పాల్గొన్నారు.