Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షులు పెండ్యాల నగేష్
నవతెలంగాణ - సరూర్నగర్
కోవిడ్ నియంత్రణకు 18ఏండ్లు నిండిన వారు అందరు వాక్సిన్ వేయించుకోవాలి అని ఆర్కెపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ అన్నారు. శనివారం రామకష్ణాపురం కాలనీ పార్క్లో గల పీహెచ్సీ సెంటర్లో జీహేచ్ఎంసీి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వాక్సిన్ మొదటి, రెండు డోసుల కార్యక్రమం పరిశీలనకు మాజీ అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్ శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణలోకి రావాలి అంటే అర్హులు అందరు వ్యాక్సిన్ వేయించు కోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సాజిద్, కొండల్ రెడ్డి, కాలనీ కార్యదర్శి సాయికుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, గొడుగు శ్రీనివాస్, లింగస్వామి, భూపాల్ రెడ్డి, కొండ్రు శ్రీనివాస్, జగన్ మోహన్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.