Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
సెప్టెంబర్ 1వ తేది నుండి పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమ వుతున్నందున ప్రతి పాఠశాలలలో వసతులు పెంచి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కషి చేయాలని పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి కోరారు. శనివారంనాడు మేడిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులతో కలసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతి హరిశంకర్రెడ్డి పాల్గొని కోవిడ్-19పై తగు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులను పాఠశాలకు పంపవలస ినదిగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అదేవిధంగా పాఠశాలలో కోవిడ్-19 నిబంధనలు (మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్) విద్యార్థులు ఖచ్చితంగా పాటించే విధంగా చూడాలని, అవసరమైన వారికి వెంటనే కరోనా టెస్టులు, ఆరోగ్య స్థితిగతుల గురించి ఎఎన్ఎం లేదా ఆశ వర్కర్లచేత అవసరమైన టెస్టులు చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు సత్యప్రసాద్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.