Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు ఆర్.శంకర్ నాయక్
నవతెలంగాణ-హిమాయత్నగర్
వేలాది కోట్ల విలువైన భూదాన్ భూముల కుంభకోణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కమిషన్ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలని తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు ఆర్.శంకర్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు 1965 చట్టం ప్రకారం అఖిల భారత సర్వ సేవా సంఘం కేంద్ర కమిటీ సిఫార్సుల మేరకు భూదాన్ యజ్ఞ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల నుంచి ఆక్రమణదారులను తరిమికొట్టి భూమిలేని అర్హులైన నిరుపేదలకు ఆ భూములను పంపిణీ చేయాలని కోరారు. బడా పారిశ్రామిక సంస్థలకు ప్రభుత్వం తప్పుగా కేటాయించిన భూదాన్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డులో విధించిన కొత్త నిబంధనలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్వోదయ మండలి నాయకులు గాజం మురళీ, కమటం యాదగిరి, కె.చందు, ఎస్.కె మహమూద్, హనుమ, భాస్కర్, హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.