Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. హిందూ శ్మశాన వాటిక ప్రబంధక సమితి అధ్యక్షుడు ఎస్.గోపాల్రావు ఆధ్వర్యంలో శనివారం గోల్నాక డివిజన్ హర్రాస్పెంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత మోగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బస్తీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా ప్రతినెలా ఉచిత వైద్య శిబిరాలను శ్మశానవాటిక ప్రబంధక సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ప్రభందక సమితి అధ్యక్షుడు ఎస్.గోపాల్రావు తెలిపారు. జనరల్, కంటి, డెంటల్, ఫిజియోథెరఫీ తదితర విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు. దాదాపు 200 మంది బస్తీల ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో రాజ్ కుమార్ విగ్, రాజేందర్ పటేల్, వీరస్వామి, విజరు కుమార్, బి. కృష్ణాగౌడ్, దల్వీర్ సింగ్, కుమార్, డాక్టర్ కొండా శ్రీనివాస్రావు, డాక్టర్ సీతారాం మహాపాత్ర, డాక్టర్ పండరి, డాక్టర్ తార తదితరులు పాల్గొన్నారు.