Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్లోని రాఘవేంద్రనగర్ కాలనీ, గణేష్ టెంపుల్ వద్ద సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్, ఈఈ నాగేందర్, ఏఈ రాజ్కుమార్లతో పర్యవేక్షించారు. సీసీ రోడ్డు నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులను, కాంట్రా క్టర్ను ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, పల్లె నర్సింగ్, కొండల్రెడ్డి, వీబీ.నర్సింహ, రవీందర్రెడ్డి, వెంకటేష్, మాస శేఖర్, మహమూద్, బింగి శ్రీనివాస్, పుష్పరాజ్, సంతోష్, బాలు, శ్యామ్, స్థానికులు బ్యాలెండరు, సుజాత, సంతోష్, రెహమాన్ పాల్గొన్నారు.