Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీలకు అతీతంగా అభివద్ధికి ప్రజా ప్రతినిధులు సహరించాలి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మునిసిపాలిటీ అభివద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులందరు సహకరించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మెన్ అబ్దుల్లా సాది అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిóగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో వివిధ అంశాలను, అనేక సమస్యలను కౌన్సిలర్లు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణ ప్రగతితో పట్టణాల్లో సమూల మార్పులు తీసుకు రావటం జరుగిందన్నారు. జల్పల్లి మున్సిపాలిటీకి వివిధ అభివద్ధి పనులు కోసం ప్రతి నెల రూ.48లక్షలు నిధులు వస్తున్నాయన్నారు. ఈ నిధులతో సిబ్బంది జీతాలతో పాటు, చెత్త వాహనాల కొనుగోలు తదితర వాటికి వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రయినేజీ నిర్మాణానికి రూ.17కోట్లు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు కలిసిమెలిసి అభివద్ధి చేసుకోవాలని సూచిం చారు. జల్పల్లిని ఆదర్శంగా మున్సిపల్గా తీర్చిదిద్దదటానికి ప్రతి ఒక్కరూ భాగ స్వాములని పేర్కొన్నారు. స్వచ్ఛ జల్పల్లి మున్సిపల్గా మార్చటానికి అందరూ ముందుకు రావాలన్నారు. జల్పల్లి పెద్ద చెరువుకు సుందరీకరణ కోసం రూ.9 కోట్ల 50లక్షలు మంజూరు, టెండర్ ప్రక్రియపూర్తి, త్వరలో పనులు ప్రారంభంమావూతాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని, ప్రతి కౌన్సిలర్కు 500 మొక్కలు, ప్రతి ఇంటికి మొక్కలు అందించాలన్నారు. కరోనా సమయంలో ప్రజలకు వైరల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అభివద్ధి కోసం సీఎంతో మాట్లాడి రూ.10లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణం కోసం కషి చేస్తామని తెలిపారు. ట్రంక్ లైన్ నిర్మాణంతో ఉస్మాన్నగర్ కాలనీ ప్రజల సమస్యకు పరిష్కారం చేయుటకు కషి చేస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించటానికి రూ.23కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. పహడీ షరీఫ్ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని అన్ని పాఠశాలలుకు తాగునీరు అందేలా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.50లక్షలు కేటాయించటం జరిగిందన్నారు. జల్పల్లి చెరువు ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ అభివద్ధి పనుల కోసం కేటాయించిన బడ్జెట్ను పాలకవర్గం ఆమోదించిందని, త్వరితగతిన అభివద్ధి పనులు ప్రారంభించి ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మెన్ ఫర్హాననాజ్, మున్సిపల్ కమిషనర్ జిపి కుమార్, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన జేసీబీని మంత్రి ప్రారంభించారు.