Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్/సరూర్ నగర్
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్ లో నివాసం ఉంటున్న కె. నరసింహారావు (63) శుక్రవారం తన చెల్లెలిని చూడటానికి హెచ్ఏఎల్ టౌన్ షిప్ కు వెళ్లాడు. టాబ్లెట్లు తెచ్చుకుంటానని ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. కానీ అతను తిరిగి రాలేదు. వారు అతని బంధువులు మరియు స్నేహితుల వద్ద అతని కోసం వెతికారు, కానీ అతని ఆచూకీ లభించలేదు.ఈ మేరకు అతని కుటుంబ సభ్యులు ఆదివారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వ్యక్తి అదశ్యం ఘటన మలక్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం అంబర్పేట్ పటేల్ నగర్ చేయిందిన సముద్రాల శంకర్ (40) మూసారాంబాగ్లో పల్లి చుడవ విక్రయిస్తుంటాడు. అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గతం లో ఎర్రగడ్డ హాస్పిటల్లో చికిత్స చేయించారు అని తెలిపారు. బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.