Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
డీఏఎల్ఎన్. మూర్తి స్మారక సమితి నిర్వహణలో ఆదివారం శ్రీత్యాగరాయ గాన సభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై మూర్తి స్మారక పురస్కారం డాక్టర్ ఆయాచితం ఎన్. శర్మ కు ప్రదానోత్సవం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ వెలదండ నిత్యానంద రావు పాల్గొని పురస్కారాన్ని బహుకరించి మాట్లాడారు. ఆయాచితం సంస్కత ఆంధ్ర భాషల్లో ఉద్దండ పండితులని కొనియాడారు. సాహితీవేత్తలు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి,తదితరులు పాల్గొన్న వేదిక పై డాక్టర్ రామ శర్మ సన్మాన పత్రం చదివారు శతక పద్య పోటీలలో విజేత లైన బాలలకు భువనేశ్వరి స్వీయ సంపుటిలను బహుకటించారు. కార్య దర్శి దత్తాత్రేయ శర్మ నివేదిక సమర్పించారు.