Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బాగ్ అంబర్పేట డివిజన్ శారదనగర్ను పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న కాలనీగా గుర్తిస్తూ ఆదివారం కాలనీ అసోసియేషన్ ప్రతినిధులకు సర్టిఫికెట్ను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలో మొబైల్ వ్యాక్సిన్ సెంటర్లతో పాటు కాలనీలలోని టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు విస్తతంగా టీకా అందజేస్తున్నట్లు చెప్పారు. బాగ్ అంబర్పేట డివిజన్ శారదనగర్లో పూర్తి స్థాయిలో ప్రజలు టీకా తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, సిబ్బంది శ్యామల, శోభ, విజయలక్ష్మి, సరస్వతి, జీహెచ్ఎంసీ డీఈ సంతోష్, వర్క్ఇన్స్పెక్టర్ రవి, కాలనీవాసులు యాదవరెడ్డి, శేఖరయ్య, విఠల్గౌడ్ సత్యనారాయణగౌడ్, రాములు, పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.