Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో పాటు గ్రామ దేవతలను పూజించినప్పుడే సుఖ శాంతులతో జీవిస్తారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లోని బాలాజీ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బొడ్రాయి పండుగ ఉత్సవాలకు చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, స్థానిక మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ బాలు నాయక్, కార్పొరేటర్లు మనోహర్, జైహింద్, మాజీ వైస్ చైర్మెన్ చిగురింత నర్సింహారెడ్డి, వెంకటాపురం మాజీ సర్పంచ్, గడ్డి అన్నారం మాజీ డైరెక్టర్ బొర్ర జగన్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ ఖలీల్ పాషా, టీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జెనిగ శ్రీనివాస్ యాదవ్, బొర్ర మాధవ్ రెడ్డి, కాలనీవాసులు డి.సాంబయ్య, గోరెంట్ల సాయిలు, నర్సిహ్మ తదితరులు పాల్గొన్నారు.