Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి
- సింథటిక్ కోర్ట్స్, స్విమింగ్ పూల్ పనులు షురూ
నవతెలంగాణ-ఓయూ
కేంద్రప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, దానిలో భాగంగా ఖేల్ ఇండియా స్కీమ్ ద్వారా క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర కల్చర్ అండ్ టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓయూ సీ గ్రౌండ్లో ఖేల్ ఇండియా నిధుల ద్వారా నిర్మించనున్న మహిళ స్విమింగ్ఫూల్, సింథటిక్ టెన్నిస్ కోర్టు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రానికి రూ.26 కోట్లు కేంద్ర నిధులు తీసుకువస్తే దానిలో రూ. 13.50కోట్లు ఓయూకి ఇచ్చామని చెప్పారు. ప్లేయర్లు క్రీడావసతులు, సదుపాయాలు, స్టేడియలు వినియోగించుకోవాలని సూచించారు. స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి, ఎందరో బహుజన వీరులను ప్రపంచానికి పరిచయం చేసిన గడ్డ ఓయూ అని కొనియాడారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో, నియోజకవర్గ పరిధిలో స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు 2% రిజర్వేషన్స్ ఇచ్చామని, త్వరలోనే ఒక సమగ్ర క్రీడా పాలసీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రానున్న మరో 15, 20 ఏండ్లలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తాము అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఓయూ వీసీ ప్రొ. డి. రవీందర్, రిజిస్ట్రార్ ప్రొ. పి.లక్ష్మీనారాయణ, పాలమూరు వీసీ ప్రొ లక్ష్మీకాంత్ రాథోడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ ప్రొ.దీప్ల, ఓఎస్డీ రెడ్యా నాయక్, ప్రిన్సిపాల్ ప్రొ.రాజేష్, డీన్ ప్రొ. సత్యనారాయణ, పలువురు ప్రిన్సిపాల్స్, డైరైక్టర్స్, డీన్స్, పీఆర్ఓ డా.సుజాత, ఎస్ఈ దేవి దాస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.