Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
రాజ్యాధికారం కోసం బీసీలంతా తెగించి పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం విద్యా నగర్ బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాజేష్ కుమార్ను ఎన్నుకొని నియామక పత్రం అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో బీసీ బంధు ప్రవేశపెడతామని ఆలోచన ఉందని చెప్పారని, కానీ ఎప్పుడు ప్రారంభిస్తారని విషయంలో స్పష్టత లేదన్నారు. రాజ్యాధికారానికి బీసీల అంతా ఏకమై పోరాటం చేయాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిందని విమర్శించారు. 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ సంక్షేమ శాఖను ప్రక్షాళన చేసి సంస్కరించాలని, పోస్టులన్ని భర్తీ చేయాలని కోరారు. కార్యకమంలో రాష్ట్ర బీసీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి జి. అనంతయ్య, విద్యార్ధి సంఘం గ్రేటర్ అధ్యక్షులు సుచిత్ కుమార్, సంగీత యాదవ్, మనికంట గౌడ్ తదితరులు పాల్గొన్నారు.