Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డీవైఎఫ్ఐ మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మంత్రి మల్లారెడ్డి వద్ద ఉన్న 600 ఎకరాల భూమిపై వెంటనే న్యాయ విచారణ చేపట్టాలని డీవైఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం షాపూర్నగర్లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో కుత్బుల్లాపూర్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం 54 ఎకరాల కంటే ఒక మనిషికి ఎక్కువ భూమి ఉండకూడదని, అలాంటిది మంత్రి మల్లారెడ్డి వద్ద 600 ఎకరాలు ఉండటంపై అనుమానం వ్యక్తమవుతుందన్నారు. రైతుబంధు పథకం కింద సంవత్సరానికి మంత్రి మల్లారెడ్డికి రూ.60 లక్షలు, నాలుగేండ్లలో రూ. 2 కోట్ల 40 లక్షలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. భూములపై న్యాయ విచారణ చేసి మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ డీవైఎఫ్ఐ మండల అధ్యక్షులు లక్ష్మణ్, మండల కార్యదర్శి జాకీర్, నాయకులు రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.