Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్రంలో బంజారా, గిరిజనుల జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాల గుర్తింపుతోపాటు, పెండ్లికాని ఆడ పిల్లలకు భవిష్యత్తులో మంచి జరుగాలని కోరుకుంటూ నిర్వహించేవే తీజ్ ఉత్సవాలని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 19వ డివిజన్ గాయిత్రి హిల్స్ కాలనీలో బడంగ్పేట్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ పారిజాత నర్సింహ్మ రెడ్డి, కార్పొరేటర్ అమిత శ్రీశైలంచారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్బంగావారు మాట్లాడుతూ.. బంజారాలు గడిచిన 9 రోజులుగా గోధుమలు బుట్టల్లో వేసి మొలుకలుగా తయారు చేసి 9వ రోజు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో అంగరంగ వైభవంగా పెండ్లికాని ఆడపిల్లలకు భవిష్యత్తులో మంచి భర్త దొరకాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక సాంప్రదాయంతో తీజ్ ఉత్సవాలు జరుకోవటం హర్శనీయమన్నారు. కార్యక్రమంలో బంజారా సంఘం ప్రదాన కార్యదర్శి శంకర్ రాథోడ్, ఉపాద్యక్షులు గోవర్దన్ నాయక్, కోశాధికారి జైథురాం, మహిళా అధ్యక్షురాలు అనూష బాయి, కాలనీ మాజీ అధ్యక్షులు ఎల్.మనోహర్, దినేశ్రెడ్డి, నాయకులు డా.సురేష్ నాయక్, రాజు నాయక్, లక్ష్మణ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, భాజిసింగ్, రాజు నాయక్ మహిళలు, యువతి, యువకులు తదితరులు పాల్గొన్నారు.