Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎస్డీవో వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సరూర్ నగర్
వాలీబాల్ క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని డీఎస్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా ఇటీవల జింఖానా గ్రౌండ్స్లో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అనంతరం సీనియర్ వాలీబాల్ పోటిల్లో సరూర్నగర్ టీం తరుపున మొదటి ప్లేస్లో ఉన్న చెరుకూరి హరిణి ఆనంద్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ క్యాపిటల్ అధ్యక్షులు కొట్టం జంగయ్య యాదవ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోచ్ లో మోహన్, రమాదేవి, క్రీడాకారులు పాల్గొన్నారు.