Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని డివిజన్ కార్పొరేటర్ నారెనశ్రీనివాస్రావు అన్నారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలో ఇంటింటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శ్రీనివాస కాలనీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీనివాస కాలనీలో దాదాపుగా వందశాతం వాక్సినేషన్ పూర్తయిందని, ఎవరైనా వేయించుకోని వారు ఉన్నా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్లో ముందున్నందుకు శ్రీనివాస కాలనీ వాసులను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ నోడల్ ఆఫీసర్ శ్రీరాములు, టాక్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, సీవో ముస్తఫా, ఎస్ఎఫ్ఏ సంజీవ రావు, హైదర్నగర్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, వేణు గోపాల రాజు, మోహన్రెడ్డి, నవీన్, యుగేష్ రెడ్డి, రమేష్, మహేష్, రమేష్, భార్గవ్ రెడ్డి, శివకుమార్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.