Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళిత గిరిజన భూ బాధితుల వినతి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పినోల్లు, తమకు గతంలో ఇచ్చిన భూమిని గుంజుకుంటున్నరని బాధితులు సగ్గు శివకుమార్, నానావత్ కిషన్ నాయక్, గాంధారి వెంకటేష్, సగ్గు మహేష్, నానావత్ మోటు తౌర్యనాయక్, నానావత్ రాజు నాయక్, సగ్గు నర్సింహ్మ తదితరులు ఆరోపించారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 3/1లో బాధితులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. 1961లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజనులకు భూమి ఇచ్చిందన్నారు. ఆ భూమిని సాగుచేస్తూ కబ్జాలో ఉన్నప్పటికీ పాసుపుస్తకాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైకోర్టుకు వెళ్లగా పాసుపుస్తకాలు ఇవ్వాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అగ్రవర్ణాల పెద్దలు తమ భూమి తమకు కాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ''అయ్యా కేసీఆర్ సార్ దళితుల అభ్యునతికి కృషిచేస్తున్నామంటున్నారు. మేము మీ పిల్లలలాంటి వారిమే మా భూమి మాకు ఇప్పంచండి'' అని సీఎం కేసీఆర్ను కోరారు. కార్యక్రమంలో శివకుమార్గౌడ్, కొంతంఎట్టయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.