Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సీఎం కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం తిరుమలగిరి జీవిత బీమా కార్యాలయం సమీపంలో ఉన్న జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీ సాయిబాబా హట్స్కు చెందిన కార్మికుడు డి.ఐలయ్య(50) లేబర్ కార్డు పొందిన కొద్ది రోజులలోనే ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో మాజీ బోర్డు సభ్యుడు శ్యామ్కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కును మంజూరు చేయించారు. ఆ చెక్కును మంగళవారం తిరుమలగిరి లాల్బజారు పార్టీ కార్యాలయంలో మర్రి రాజశేఖర్ రెడ్డి కంటోన్మెంట్ బోర్డు ఏడో వార్డ్ మాజీ సభ్యుడు ప్యారాసాని శ్యామ్ కుమార్ కలిసి అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1,30,000 (ఒక లక్ష ముప్పది వేల రూపాయలు) చెక్కును ఐలయ్య భార్య పుష్పకు అందజేశారు. అలాగే సుమారు 1000 (వెయ్యి) మందికి లేబర్ కార్డ్స్ను అందించినట్లు వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ లేబర్ కార్డ్స్ను తీసుకోవాలని సూచించారు.
శ్యామ్ కుమార్ మేలు మరువలేనిదిలి : పుష్ప
కంటోన్మెంట్ బోర్డు ఏడో వార్డు మాజీ సభ్యుడు ప్యారాసాని శ్యామ్ కుమార్ తన భర్త ఐలయ్యకు లేబర్ కార్డ్ ఇప్పించడం వలన రూ.1,30,000 (ఒక లక్ష ముప్పది వేల రూపాయలు) చెక్కు పొందానని పుష్ప చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కంటోన్మెంట్ బోర్డ్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్యారాసాని, శంకర్, రాజారెడ్డి, యశ్వంత్ కుమార్, సుధాకర్, విజరు, రాజు, సాగర్, వేణుగోపాల్, గోపి, డిసౌజా, సురేష్, సెంట్రల్ బట్టి శ్యామ్ కుమార్, ఆర్కే రామ్, శేఖర్, ఎంపి రాజు, డీ.వెంకటయ్య, అనిల్, డీ.శ్రీనివాస్, శాంతయ్య, మహిళా నాయకురాళ్లు సువర్ణ, పద్మ, రజిని పాల్గొన్నారు.