Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ పట్టణ కేంద్రంలోని ఇటీవల ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు కురవడంతో రోడ్డు శిథిలావస్థకు చేరింది. అల్వాల్ నుండి ఐస్ ఫ్యాక్టరీ సుచిత్ర రోడ్డు వరకు వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. రోడ్డు వెంబడి 40 కాలనీలు ఉంటాయని, నిత్యం ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతూ కాలనీలో నుంచి వివిధ సరుకులను తీసుకురావాలంటే ఓల్డ్ ఆల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి రావల్సి ఉంటుందని, ప్రజలకు అనేక ఇబ్బందులతో వివిధ పనులకు వెళ్లాల్సిన ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టాలని అనేకసార్లు మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని వాపోయారు. ప్రజలు దోమలతో ఇబ్బందులకు గురవుతూ ఉంటే రాజకీయ నాయకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తు న్నారని కాలనీ అసోసియేషన్, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీజేపీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టినా స్పందించని ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుంది అని వారు ప్రశ్నించారు. ఈ రోడ్డు పరిస్థితి ఏమిటని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేడా, ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్, అధికారులు దీన్ని దష్టిలో పెట్టుకొని రోడ్డు వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని వివిధ కాలనీల అసోసియేషన్ వారు హెచ్చరించారు
హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజీవ్గాంధీ నగర్లో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను ఛత్రినాక పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కత్తి, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ జిలానీ తెలిపిన వివరాల మేరకు.. అబ్బోజు రవి అనే కారు డ్రైవర్ ఉప్పుగూడ లోని రాజీవ్గాంధీ నగర్లో నివాసముంటున్నాడు. అయితే స్థానికంగా నివాసముంటున్న అయ్యవారి కడప ఉమాకాంత్ అనే వ్యక్తి బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తుండేవాడు. దాంతో ఉమాకాంత్పై కక్ష పెంచుకున్న రవి ఎలాగైనా అడ్డుతొలిగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సికింద్రాబాద్లో నివాసముం టున్న తన స్నేహితుడైన ఎడ్ల వెంకటేశ్వర్లుకు విషయం చెప్పాడు. పథకం ప్రకారం ఈనెల 29న ఉమాకాంత్ను ఉదయం రవి తన రూంకు పిలిపిం చుకున్నాడు. వెంకటేశ్వర్లుతో కలిసి దారుణంగా హత్య చేశాడు. అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.