Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
తొంబై శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఏకమై బహుజన రాజ్య స్థాపనకు కృషి చేయాలని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ కటికల శ్రీహరి ముదిరాజ్ అన్నారు. మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని చెంగిచెర్ల అర్టీసీ కాలనీలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సమాజాన్ని చైతన్యం చేసేలా కార్యకర్తలను చైతన్యవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో కూడా సైకిల్ పై ఊరూరా తిరిగి బీఎస్పీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత మాన్యశ్రీ కాన్షీరాం కే దక్కిందని అన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రావాలంటే భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన ఓటు అనే హక్కును మన కోసమే వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో బోడుప్పల్ బీఎస్పీ అధ్యక్షుడు బండా నర్సింహ కురుమ, నాయకులు రవీందర్ నాయక్ జిల్లా కో ఆర్డినేటర్ శీలం అనితా రెడ్డి, రాజయ్య, మహిళ కన్వీనర్ లక్మ్షీ, ఆనంద్, మాజీ కన్వీనర్ మల్లేశం, మాజీ అధ్యక్షుడు చిన్నింగిల కుమార్, నాయకులు హాజరయ్యారు. ఈసందర్భంగా బోడుప్పల్కు చెందిన పలువురు నాయకులు బీఎస్పీ సభ్యత్వం తీసుకున్నారు.