Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్ పల్లి మున్సిపల్ పరిధిలో మురుగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇక్కడి మెట్రో సిటీ, నాబిల్ కాలనీలో మంత్రి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందరర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వెనుక బడిన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రయినేజీలు, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్, చైర్మెన్ అబ్దుల్లా సాది, రిప్రజెంటేటివ్ వైస్ చైర్మెన్ యూసూఫ్ పటేల్, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలీఫా, కౌన్సిలర్లు జాఫర్ బాం, ఉస్మాన్ గాలిబ్, శంశోద్దిన్, రాధికా శ్రావణ్ అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.