Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒంటిపై వేడి నూనె పోసిన వ్యక్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం స్థానికులు తెలిపిన వివరాల మేరకు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో కాకతీయ వైన్స్ ఉంది. సోమవారం రాత్రి వైన్స్ సిట్టింగ్ రూమ్లో కొందరు మద్యం సేవిస్తున్నారు. శివకుమార్, ధర్మేందర్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్య సిట్టింగ్ రూంలో చిన్నవివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ధర్మేందర్ అక్కడే కాగుతున్న వేడి నూనెను శివకుమార్పై పోశాడు. అప్రమత్తమైన స్థానికులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన శివకుమార్ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు ధర్మేందర్ను అదుపులోకి తీసుకున్నారు. ధర్మేందర్ ఓ బీజేపీ నాయకుని వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్నట్టు సమాచారం.