Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కొవిడ్ రూల్స్ పాటిస్తూ ఓయూ హాస్టళ్లను నడపాలని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ప్రిన్సిపల్స్కు, అధికారులకు సూచించారు. సెప్టెంబర్ ఐదు నుంచి ఓయూ పరిధిలోని హాస్టళ్లను ప్రారంభించాలని సోమవారం ప్రిన్సిపాళ్లతో జరిగిన సమావేశంలో వారు ఆదేశించారు.
హాస్టల్కు వచ్చే ప్రతీ స్టూడెంట్ తప్పకుండా కొవిడ్ వ్యాక్సిన్ ఫస్టు డోస్ అయినా వేయించుకుని ఉండాలని, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను దరఖాస్తుకు జోడించాలని చెప్పారు. హాస్టల్ ఫెసిలిటీ కోసం స్టూడెంట్లు సెప్టెంబర్ ఫస్టు నుంచి 5 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీహెచ్డీ స్టూడెంట్స్ తమ మెస్ డ్యూస్లో ఉన్న కనీసం 50 శాతం చెల్లించాలని, పీజీ స్టూడెంట్లు, ఎస్సీ ఎస్టీలు రూ.4వేలు, బీసీ స్టూడెంట్స్ రూ.5వేలు, ఓసీ స్టూడెంట్స్ రూ.6వేలు చెల్లించాలని ఓయూ మెస్ రూల్స్ను వివరించారు. ఈ మేరకు ఓయూ అధికారులు హాస్టల్ ఓపెనింగ్ కోసం ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. హాస్టల్స్ తెరవాలన్న నిర్ణయంతో స్టూడెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.